రీమేక్‌ల జోరులో వ‌కీల్ సాబ్‌..

1807


హైద్రాబాద్, ఆగస్టు 21
పవన్ కళ్యాణ్ కి సినిమా ల విషయంలో మిత్రుడు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా త్రివిక్రమే. పవన్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత త్రివిక్రమ్ జనసేనకు పవన్ స్పీచ్ కి మాటలు రాసాడని టాక్ ఉంది. తర్వాత రాజకీయాల్లో పవన్ బిజీ అయ్యాక.. త్రివిక్రమ్ సినిమాల్లోకి వచ్చేసాడు. అయితే అప్పట్లోమెగా ఫ్యామిలీ కి ఇష్టం లేకుండా పవన్ జనసేన పార్టీ పెట్టాడని.. దానికి తివిక్రమ్ హెల్ప్ ఉందని… అందుకే మెగా హీరోల ఛాన్స్ లు త్రివిక్రమ్ కి రావని ప్రచారం జరిగింది.

మధ్యలో పవన్ రాజకీయాల్లో త్రివిక్రమ్ నాకు హెల్ప్ చెయ్యలేదు అంటూ త్రివిక్రమ్ మీద మచ్చ లేకుండా మాట్లాడాడు. తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో సినిమాలు చేసాడు అది వేరే విషయం.అయితే తాజాగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ చెబితేనే మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం వేణు శ్రీరామ్ కన్ఫర్మ్ చేసాడు. త్రివిక్రమ్ పింక్ రీమేక్ చెయ్యమని త్రివిక్రమ్ సూచించబట్టే పింక్ రీమేక్ వకీల్ సాబ్ చేస్తున్నాడు.

ఇక తాజాగా త్రివిక్రమ్ మరో రీమేక్ పవన్ ని చెయ్యమని చెప్పినట్టుగా సోషల్ మీడియా టాక్. పవన్ కళ్యాణ్ ని మలయాళ రీమేక్ అయ్యప్పన్ కోషియం రీమేక్ చెయ్యమని త్రివిక్రమ్ చెప్పాడట. ఎందుకంటే హారిక అండ్ హాసిని వారి ఓన్ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ వారే అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ రైట్స్  కొన్నారు. ఆ సినిమా చూసి  పవన్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అని త్రివిక్రమ్ చెప్పాడని.. ఈ రీమేక్ ని పవన్ సూచనలతో త్రివిక్రమ్ తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి చేతిలో పెట్టనుననట్లుగా ఫిల్మ్నగర్ టాక్.

అయితే పవన్ మాత్రం త్రివిక్రమ్ ఏది చెప్పినా చేస్తాడని.. ఇక ఈ సినిమాలో మరో పాత్రకి తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించే అవకాశం ఉన్నట్లుగా టాక్.  వకీల్ సాబ్ పూర్తయ్యి, క్రిష్ సినిమాని, హరీష్ శంకర్ సినిమాలు పూర్తయ్యాకే ఈ మలయాళ రీమేక్ పట్టాలెక్కుతోంది అని అంటున్నారు