శిరోముండనం కేసులో ఏడుగురు అరెస్టు

1813

శాఖ జిల్లా పెందుర్తి మండలం గిరిప్రసాద్ నగర్ కు చెందిన దళిత యువకుడికి గుండు గీసి దాడి చేసిన ఘటనలో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు ..దీనికి సంబంధించిన వివరాలను శనివారం ఉదయం పోలీస్ కమిషనరేట్ లో నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు ..శ్రీకాకుళం జిల్లా పలాస కు చెందిన కర్రీ శ్రీకాంత్ 20 కు నాన్న అమ్మ చెల్లి ఉన్నారు.. ఉపాధి కోసం విశాఖ వచ్చిన అతడు నగరంలోని సుజాత నగర్ లో గల సినీ నిర్మాత బిగ్ బాస్ 2 సేమ్ నూతన్ నాయుడు ఇంట్లో నాలుగు నెలల క్రితం పనికి కుదిరాడు.. కాగా ఈ నెల 1 న జీతం తీసుకొని పని మానేశాడు.. తమ ఇంట్లో లో దొరికి గురైన సెల్ ఫోన్ గురించి మాట్లాడాలని నూతన్ నాయుడు భార్య గురువారం రాత్రి శ్రీకాంత్ నీ ఇంటికి రప్పించారు.. సెల్ఫోన్ విషయమై నిలదీయడంతో తనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలని చెప్పి శ్రీకాంత్ వెళ్లిపోయాడు ..శుక్రవారం మధ్యాహ్నం మరోసారి సూపర్వైజర్ ద్వారా శ్రీకాంత్ ఇంటికి పిలిపించారు. నూతన్ నాయుడు భార్య ఇంట్లో పని చేస్తున్న సిబ్బంది అతన్ని గట్టిగా కొట్టి ఇ గాయపరిచారు .ఆ తర్వాత బార్బర్ ను పిలిపించి శ్రీకాంత్ గుండు కొట్టించారు. అంతటితో ఆగకుండా రాడ్డు తో దాడి చేసి అతన్ని గాయపరిచారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించి పంపించేశారు. ఈ విషయం మీడియా ద్వారా శ్రీకాంత్ బహిర్గతం చేశాడు. ఎందుకు పోలీసులు అతని స్టేషన్కు తీసుకెళ్ళి విచారించగా మొత్తం వివరాలు ఫిర్యాదు రూపంలో ఇచ్చాడు .ఈ సంఘటనపై కేసు నమోదు చేసి పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేయగా దీంట్లో ఏడుగురు భాగస్వాముల్ని గుర్తించి అరెస్టు చేశారు .అందులో లో ఉన్న నూతన్ నాయుడు భార్య ప్రియా మాధురి, ఇందిరా రాణి , వరహాలు బాలగంగాధర్, ఝాన్సీ, సౌజన్య రవికుమార్ తదితరులను శనివారం ఉదయం అరెస్టు చేశారు. ఈ సంఘటనపై ఇప్పటికే దళిత సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. పోలీస్ కమిషనర్ ను కలిసి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది.. దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని తప్పక శిక్షిస్తామని సి పి మనీష్కుమార్ సిన్హా చెప్పడంతో ఆందోళనలు సద్దుమణిగాయి. ఈ విలేకరుల సమావేశంలో సి పి తో పాటు డిసిపి క్రైమ్ , సౌత్ ఇంచార్జి డిసిపి వి. సురేష్ బాబు ఏసీపీ వెస్ట్ ఇంచార్జ్ శ్రవణ్ కుమార్, పెందుర్తి ఇన్చార్జి సీఐ మల్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు