పోలీసు బాసులూ ఎందుకిలా?

654

స్టేషన్లతోపాటు అన్ని విభాగాల పోలీస్ సిబ్బందిపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో డీజీపీ ఆఫీస్ ఉన్నట్లు తెలిసింది. క్షేత్ర స్థాయిలో పనిచేసే హోంగార్డు నుంచి ఏపీ స్థాయి అధికారి వరకు నిఘా ఉంచాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్ప టికే అవినీతి అధికారుల లిస్ట్ తయారుచేసినట్లు తెలిసింది. వారిపై ముందుగా అంతరత విచారణ చేపట్టడంతోపాటు స్టే షన్‌కి వచ్చే బాధితులతో సిబ్బంది బిహేవియర్‌‌‌‌పై ఫీడ్‌‌ బ్యాక్ తీసుకోనున్నారు.యూనిఫామ్ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారు. గ్రేటర్ పరిధిలో లంచాలు తీసుకుంటూ కొందరు ఏసీబీకి పట్టుపడుతుంటే, సివిల్‌ సెటిల్మెంట్లలో తలదూర్చి మరి కొందరు సస్పెండ్ అవుతున్నారు. ఇలాంటి సమస్యలపై కంప్లయింట్స్ పెరుగుతుండడంతో ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల సివిల్‌ సెటిల్మెంట్ల ఆరోపణలతో వనస్థలిపురం ఏసీపీ జయరామ్‌‌, ఎస్సార్‌‌‌‌నగర్‌ ‌‌‌ఇన్‌‌స్పెక్టర్‌ ‌‌‌మురళీకృష్ణ, ఓ మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యంగా వ్యవహరించిన సిటీ ఎస్బీ ఇన్‌‌స్పెక్టర్‌‌ ‌‌కె.చంద్రకుమార్‌ ‌‌‌సస్పెన్షన్ డిపార్ట్‌మెంట్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. వరుస ఘటనలతో ఉన్నతాధికారులు అలర్ట్‌అయ్యారు.

. పోలీసుల అవినీతి, అక్రమాలు, వేధింపులపై ఆధారాలుంటే నేరుగా వచ్చి కంప్లయింట్ ఇవ్వచ్చని, కమిషనరేట్ల వాట్సాప్ నంబర్ ద్వారా అయినా తమ దృష్టికి తీసుకురావచ్చని సీపీలు చెప్తున్నారు. తప్పు చేసిన పోలీసులపై చర్యలు తీసుకునేందుకు సిటిజన్లు సహకరించాలని ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఇష్యూ సందర్భంగా హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ట్ ట్విట్టర్లో కోరారు

ఇప్ప టికే అవినీతి అధికారుల లిస్ట్ తయారుచేసినట్లు తెలిసింది. వారిపై ముందుగా అంతరత విచారణ చేపట్టడంతోపాటు స్టే షన్‌కి వచ్చే బాధితులతో సిబ్బంది బిహేవియర్‌‌‌‌పై ఫీడ్‌‌ బ్యాక్ తీసుకోనున్నారు.ఈ నెల 18న లైంగిక వేధింపుల కేసులో సిటీ ఎస్ బీ ఇన్‌స్పెక్టర్‌ కె.చంద్రకుమార్‌‌పై నిర్భయ కేసు, సస్పెన్ష న్ వేటు. ఈ నెల17న సివిల్‌ సెటిల్మెంట్ ఆరోపణలతో వనస్థ లిపురం ఏసీపీ జయరామ్, ఎస్ఆర్‌నగర్‌‌ ఇన్‌స్పెక్టర్‌‌ మురళీకృష్ణ సస్పెన్ష న్. జూలై 9న కోర్టు ఆర్డర్‌‌ఇంప్లిమెంట్‌ చేసేందుకు రూ.1.2లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన షాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌‌బి.శంకరయ్య, ఏఎస్ ఐ కె.రాజేందర్‌‌. జూన్‌ 6న బంజారాహిల్స్‌ ల్యాండ్‌ కేసులో రూ.1.50 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్ఐ రవీందర్‌‌. జనవరి 9న స్టే షన్‌ బెయిల్ కోసం రూ.50వే లు, మందు బాటిల్స్‌ తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జూబ్లీహిల్స్‌ ఎస్ఐ పి.సుధీర్‌‌, ఇన్‌స్పెక్టర్‌‌ బల్వంతయ్య.మహిళా ఉద్యోగినిని వేధించిన కేసులో మాజీ ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌ కె.చంద్రకుమార్‌‌ కోసం వనస్థలిపురం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నెల 18న కేసు ఫైల్ కాగా, పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. పోలీసులు కాల్‌‌డేటా ఆధారంగా రెండు స్పెషల్‌‌ టీమ్స్‌తో సెర్చ్ చేస్తున్నారు. ఆయన సొంత ప్రాంతం ఏలూరుకూ వెళ్లారు. బాధితురాలు కంప్లయింట్చేస్తుందని ప్లాన్‌ ప్రకారమే ఎస్కేప్ అయ్యాడని అనుమానిస్తున్నారు.