రామాయణమే నమ్మనివాళ్లు, రావణుడిని ఎందుకు వెనకేసుకొస్తారు?

1029

సిద్దార్థి సుభాష్ చంద్రబోస్

ప్రశ్న-జవాబులు: —

  • “నువ్వు పురాణాలు, దేవుళ్లని నమ్మవు, మరెందుకు నీ వాదనకు మద్దతుగా పురాణాలి ఉటంకిస్తున్నావు?” ఒక సనాతనుడు లేచి, వితంతు వివాహానికి మద్దతుగా పురాణాల్లోని ఉదాహరణాల్ని చూపుతూ ప్రసంగిస్తోన్న కందుకూరి వీరేశలింగం అనే సంస్కర్తని నిలదీశాడట సభలో దానికి సమాధానం అయనిలా చెప్పాడు. “అయ్యా, నాకు గుడ్డితనం లేదు. నీకుంది. నాదారి బాగా కనిపిస్తోంది. నువ్వు తడుముకుంటున్నావు. అందుకే నీకు వెలుగని భావిస్తోన్న నీ పురాణాన్ని ఎత్తి నీకు వెలుగు చూపిస్తున్నాను.
  • ఎందుకంటే చీకట్లో కనపడకపోతే సరైనదారిలో నడుస్తోన్న నన్ను గుద్దేసే ప్రమాదం నాకుంది కాబట్టి”.–రామాయణం ఒక కావ్యం. పురాణాలు, ఇతిహాసాలవలె అదొక వ్యక్తి లేదా వ్యక్తులు రాసిన రచన. అందులోని పాత్రలు, వాళ్ల వ్యక్తిత్వాలూ, సాంఘిక పరిస్తితులు, ఉద్దేశాలూ, భావజాలాలూ పరిశీలన, పరామర్శ, విమర్శ చేస్తూ ఇప్పటికి ఈ దేశంలో లక్షలుగా వచ్చివున్నాయి. అందుల్లో డాక్టరేట్లు చేశారు, పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఎందుకంటే ఒక్క రామాయణమే ప్రస్తుతం వేలసంఖ్యల్లో రాశారు. కాబట్టి రామాయణం ఇంట్లో పూజకు పెట్టుకునేవాళ్లు చదువురానివాళ్లు. చదువుకున్నవాళ్లు అందులోని లోటుపాట్లను, పాత్రలని చర్చిస్తారు.—కాదని కొట్టిపారేసేలా ప్రతివాదన చెయ్యడం ఒకరకమైతే, అతని వాదనని అంగీకరిస్తూ అందులోనికి ప్రవేశించి అందులోని డొల్లని ఎత్తిచూపి అతడిని ఒప్పించి మరీ, అతనివాదన తుంచేయడం రెండవది. నిజానికి రెండవది నిలకడైనదీ, ఓపికతో కూడుకున్నది, ఫలితాల్ని సమర్థవంతంగా అందించేది.-
  • -*నువ్వు రామాయణం గురించి మాట్లాడుతున్నావంటే మరోరకంగా రాముడి భావజాలన్ని మోస్తున్నట్లే కాబట్టి ఆ విషయం మాట్లాడరాదు అంటూ అతితెలివి వాదన లేవనెత్తి అది చర్చకు, విమర్శకు రాకుండా దారిమల్లిస్తారు.కులమతాలు పోవాలని రాస్తే నీవింకా కులాన్ని అంటిపెట్టుకున్నావు అని నిందించే మోసకారి వాదనకిది దగ్గరి వాదన. మూఢాచారాలు పోవాలని రాస్తే నీవింకా మూఢాచారాల్లో వున్నావనే బాపతు ఇది.

(ఈ విషయమై మరిన్ని ప్రశ్నల్ని ఆహ్వానిస్తూ)