అమెరికాలో సైనిక తిరుగుబాటు వెనుక మర్మ ం

2464


డా. శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు
ద్రవిడ బహుజన సమితి

అమెరికా వార్తలు మన వాళ్లకు పెద్దగా ఆసక్తికరంగా లేకపోవడం వింతగా వుంది. బహుశా మోదీ మీడియా ట్రంపుకు అనుకూలంగా వుండటం వొక కారణం కావొచ్చు. ట్రంపు అధికార పీఠం వొదలడానికి నిరాకరించి అమెరికన్ల అభిప్రాయాన్ని అగౌరవపరిచాడు. సెనేట్ సభ్యులు ట్రంపు మీద అభిశంసన పెట్టి, ట్రంపుకు వ్యతిరేకంగా తీర్మానం చేయటం కూడా జరిగింది. ఆ సందర్భంగా ట్రంపు మద్దతుదారులు సాయుధులై వొచ్చి, అమెరికా పారమెంటును ఆక్రమించుకున్నారు. నిజానికి ఇది చాలా పెద్ద వార్త. సుమారు యాభై రాష్ట్రాలలో హింస పెచ్చరిల్లింది. మాజీ సైనికులు, తాజా సైనికులు ట్రంపుకు మద్దతుగా ఆయుధాలతో రోడ్ల మీదికెక్కారు. అమెరికా రాజకీయాలకు సైనికులకు మధ్య ఎలాంటి సంబంధం వుందో ఈ సంఘటన నిరూపిస్తంది.

ట్రంపుది రేసిజం. అది అమెరికా స్వభావానికి విరుద్దం. ఎందుకంటే అమెరికా వొక జాతి రాజ్యం కాదు. అమెరికా స్థానిక జాతులను నాశనం చేసి, బ్రిటిష్ వాళ్లు అక్కడ వలస రాజ్యాన్ని స్థాపించారు. ఆ తర్వాత అనేక చారిత్రక, రాజకీయ పరిణామాల కారణంగా అమెరికా స్వతంత్ర దేశమైంది. కానీ నానాజాతుల ఆశ్రిత దేశం గా అది రూపొందింది. అది పరాయి దేశాల నుండి వలస వచ్చిన వాళ్లు నిర్మించుకున్న దేశం. రెడ్ ఇండియన్లు, హిస్పానియన్లు, ఆఫ్రికన్ అమెరికన్లు, లాటిన్ అమెరికన్లు, ఆసియన్లు కలిసి బతికే వొక దేశం. అయితే, ఆ అమెరికా రాజ్యాంగ యంత్రాంగాన్ని శాసించేది మాత్రం యూదులే అన్నది జగమెరిగిన సత్యం. అమెరికా అగ్ర రాజ్యం స్థానంలో వుండటం యూదులకు చాలా అవసరం. అమెరికా ద్వారా ప్రపంచాన్ని నియత్రించే వొక వ్యూహాన్ని యూదులు చాలాకాలంగా అమలు చేస్తున్నారు. అమెరికా సంపన్నులంతా యూదులే అన్నది నిజం. వాట్సాప్,‌ ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికలన్నీ యూదులవే. మైక్రోసాఫ్ట్ మొదలు, ప్రపంచ నాశనానికి తోడ్పడే అణ్వాయుధాల తయారీకి ఉపయోగపడే యంత్రాలను పదార్థాలను తయారు చేసే సంస్థలు, ఆయుధ విక్రేత సంస్థలూ అన్నీ వాళ్లవే. ముఖ్యంగా అమెరికా గుఢాచార వ్యవస్థను యేలేదంతా వాళ్లే. ట్రంపుకూడా యూదు మూలాలు గల వ్యక్తి. క్లింటన్, ఒబామ, ట్రంపు, బైడెన్ ఎవరు ప్రెసిడెంట్ అయిన కూడా యూదుల క్షేమం కోసం పని చేయాల్సిందే. వొక్క మాటలో చెప్పాలంటే ఇండియాలో బ్రాహ్మణులు ఎలాంటి పాత్ర పోషిస్తారో, యూదులు అలాంటి వాళ్లు అన్న మాట. అయితే, యూదులు ప్రపంచంలో అత్యంత ఎక్కువ హింసను, అన్యాయాన్ని చవిచూశారు. మన దేశంలో బ్రాహ్మణులు అలాంటి హింసను ఏ కాలంలోనూ అనుభవించిన దాఖలాలు లేవు.

ట్రంపుకు ముందు వున్న ప్రెసిడెంట్లు ఎవరూ కూడా శ్వేతజాతీయవాదాన్ని ఇంత బాహాటంగా వ్యక్తం చేయలేదు. అబ్రహాం లింకన్ బానిసత్వాన్ని రద్దు చేసినా, ఆఫ్రికన్ అమెరికన్లకు యింకా జాతి వివక్ష తప్పటం లేదు. ఒబామా కూడా అపార్థీడ్ వర్గాల ప్రతినిధిగా కాకుండా, అమెరికన్ యూదు పెట్టుబడిదారుల రాజకీయ ప్రతినిధిగా ఎదిగాడు. యూదులకు, ముస్లింలకు మధ్య జరుగుతున్న హింసాత్మక యుద్దాన్ని వొక కొలిక్కి తీసుకొచ్చిన ఘనత ఒబామాకు దక్కింది. ఒసామా బిన్ లాడెన్ హత్య ఒబామా ద్వారానే జరిగింది. అయితే, మూడోసారి అతడు అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం లేదు. అందుకే, శ్వేత జాతీయవాదాన్ని, అమెరికా ప్రయోజనాల పరిరక్షణ పేరుతో వొక అహంకారపూరిత వ్యాపారి ట్రంపు రాజకీయ ప్రవేశం చేశాడు. పబ్లిక్ బిహేవియర్ సెన్సు కూడా లేని ట్రంపు గెలుపును నిరసిస్తూ న్యూయార్క్ నగరంలో భారీ ప్రదర్శనలు జరిగాయి. కానీ కన్సర్వేటివ్ ఐడియాలజీ వున్న ట్రంపు మద్దతుదారులు ట్రంపును బాగా వెనకేసుకొచ్చారు. ట్రంపు విదేశాంగ విధానం వల్ల, ముఖ్యంగా సరిహద్దు దేశాలతో ఆయన వైఖరి వల్ల పెద్ద అపప్రద మూటగట్టుకున్నాడు. అయితే, అమెరికా రాజకీయాలలో ఇండియన్ అప్పర్ క్యాస్టులు చురుకుగా కీలకంగా మారిన వొక చారిత్రక దశను మనం గమనించొచ్చు.

అమెరికా పార్లమెంటరీ వ్యవస్థ మీద, అమెరికా రహస్య నిఘా సంస్థల పని తీరు మీద మనం వొక అంచనాకు రావడానికి డిసెంబరు ఆరు నాటి ట్రంపు మద్దతుదారుల నిరసనలు, హింసాత్మక చర్యలు తోడ్పడతాయి. ప్రపంచంలో ఎక్కడ ప్రజాస్వామిక హక్కులు ప్రమాదంలో పడ్డా, పార్లమెంటరీ క్రైసిస్ తలెత్తినా జోక్యం చేసుకొనే అమెరికా, ఇప్పుడు నవ్వుల పాలైంది. నాకైతే పాకిస్తాన్ కూ అమెరికాకూ మధ్య పెద్ద తేడా ఏమీ కనపడ లేదు. పాకిస్తాన్ లో కూడా సైన్యాధ్యక్షులు ప్రెసిడెంట్లను, ప్రధానిని నియంత్రించడం, తిరుబాటు చేసి పార్లమెంటును స్వాధీనం చేసుకోవడం మనం చాలాసార్లు చూశాం. ఇంచుమించు అమెరికాలో కూడా మొన్న అలాగే జరిగింది. కాబట్టి అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం కాలేదని తెలుస్తోంది. యిక, సిఐఏ, ఎఫ్.బి.ఐ వంటి పటిష్ఠమైన నిఘా సంస్థలకు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరుంది. ఏ దేశంలో టెర్రరిస్టు అటాక్ జరగబోతుందో ముందే హెచ్చరించే అమెరికా నిఘా సంస్థలు ట్రంపు అనుకూల సాయుధ ముఠాలు వీరంగం సృష్టించబోతున్నాయని ముందే ఎందుకు పసిగట్టలేక పోయాయి? అలా బాహాటంగా ఎలా ఆయుధాలతో నిరసనలకు దిగారు? ముఖ్యంగా మాజీ సైనికులు అలా ఎలా వొక రాజకీయ ఆందోళనలు చేయగలిగారు? వాటిని నిఘా సంస్థలు ఎందుకు నిలువరించ లేదు? ఇక్కడే అందరికీ కొన్ని అనుమానాలు తడుతున్నాయి.

సిఐఏ అనేది కేవలం నిఘా సంస్థ మాత్రమే కాదు. అది ప్రపంచాన్ని శాసించే గుఢాచార వ్యవస్థ. అది తనకు అనుకూలంగా ప్రతి ప్రెసిడెంట్ ను మార్చుకుంటది. తన మాట వినేలా పరిస్థితులను సృష్టిస్తుంది. బైడెన్ను బ్లాక్ మేయిల్ చేసి, లొంగదీసుకోవడానుకే సిఐఏ తిరుగుబాట్లను ప్రోత్సహించిందనే ఆరోపణ కూడా వుంది. ఈ ఆరోపణను అంత తేలిగ్గా తీసిపారెయ్య లేము.

అమెరికా రాజకీయ వ్యవస్థ వొక పరివర్తన దశలో వుందని ఈ సంఘటనలను చూసి చెప్పలేము. కానీ అమెరికా ప్రజాస్వామ్యం తప్పకుండా లిబరల్ గా మారక తప్పదు. లాటిన్ దేశాల నుండి వలస వొచ్చిన వాళ్ల ప్రభావం, అలాగే ఆసియా దేశాలైన చైనా, పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్, కొరియా దేశాల నుండి వలస వొచ్చి స్థిరపడిన వాళ్లూ, అలాగే అస్థిర మధ్యాసియా దేశాల నుండి వలస వొచ్చిన వాళ్లూ అంతా కలిసి శ్వేత జాతి దురహంకారాన్ని వోడించి, తమకు అనుకూలమైన అమెరికా సామాజిక, రాజకీయ వ్యవస్థను నిర్మించుకోక తప్పదు. అయితే, యూదు దురహంకారులు, ఇండియన్ మనువాదులతో చేతులు కలిపితే మాత్రం అమెరికా వొక భయంకరమైన ప్రపంచ వ్యతిరేక దిశలో పయనించి తీరుతుంది. నాకైతే, అమెరికా ఇదే దిశలో అడుగులేస్తుందని అనిపిస్తుంది. మరి మీకూ?